🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 05 June 2026, 12:22 PM Posted by: MANA VISHWAM

స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో కొత్త ముప్పు.. యువతలో వేగంగా పెరుగుతున్న ఆ వ్యాధి

నిరంతరం తల కిందకు వంచి మొబైల్ ఫోన్ చూడటం వల్ల మెడ వెన్నెముకపై అధిక ఒత్తిడి పడుతోంది. దీనివల్ల మెడ కండరాలు, స్నాయువులు, నరాలు దెబ్బతిని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. గతంలో ఎక్కువ గంటలు కంప్యూటర్ ముందు కూర్చునే ఉద్యోగులు లేదా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు టీనేజర్లు, కళాశాల విద్యార్థుల్లో కూడా ఎక్కువగా నమోదవుతోంది.జుకు పలువురు యువకులు ఆసుపత్రుల బాట
వైద్యుల సమాచారం ప్రకారం, బెంగళూరులోని ఆర్థోపెడిక్ ఓపీడీలలో ప్రతిరోజూ రెండు నుంచి మూడు టెక్స్ట్ నెక్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత విద్య, ఉద్యోగాలు, వినోదం అన్నీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు మారడంతో స్క్రీన్ టైమ్ గణనీయంగా పెరిగింది. దీని ప్రభావం ఇప్పుడు యువత ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తోంది.ఎలా మొదలవుతుంది ఈ సమస్య?మొదట్లో మెడ నొప్పి, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమంగా ఈ నొప్పి భుజాల వరకు వ్యాపిస్తుంది. అనంతరం తలనొప్పి, అలసట, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు మొదలవుతాయి. పరిస్థితి మరింత తీవ్రమైతే మెడలోని నరాలపై ఒత్తిడి పెరిగి చేతుల్లో తిమ్మిరి, బలహీనత, సూది గుచ్చినట్లు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరమయ్యేంత తీవ్ర స్థితికి చేరుకునే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన ఓ యువ ఐటీ ఉద్యోగి నిరంతర స్క్రీన్ వినియోగం కారణంగా చేతుల బలాన్ని కోల్పోయి చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిన ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.
🏠 Home