గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. దర్శకుడు బుచ్చాబాబు సన రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే సినిమా విజయంతో పాటు కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను చూపించిన తీరు, కొన్ని సన్నివేశాల్లో మహిళల ప్రాతినిధ్యంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. ఈ అంశంపై ఆయన సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ ప్రకటన విడుదల చేస్తూ వివరణ ఇచ్చారు. అవసరమైతే క్షమాపణలు చెప్పడానికీ వెనుకాడలేదు.