🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 01 July 2026, 11:05 PM Posted by: MANA VISHWAM

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పొన్నం కౌంటర్: ‘మాజీ మంత్రులు వస్తేనే చర్చకు సిద్ధం..!’ ​

సంక్షేమ శాఖలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విసిరిన సవాలును రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. అయితే, ఈ చర్చకు ప్రవీణ్ కుమార్‌ కాకుండా, బాధ్యతగల మంత్రులుగా పని చేసిన ఆ పార్టీ మాజీ మంత్రులు వస్తేనే తాము ప్రెస్ క్లబ్ వేదికగా చర్చించడానికి సిద్ధమని స్పష్టం చేశారు.​ఈ మేరకు పొన్నం ప్రభాకర్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయంగా కష్టపడి పైకొచ్చిన బలహీన వర్గాల నాయకులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.

​శాసనసభలోనే తేల్చుకుందాం.. లేదా ప్రెస్ క్లబ్‌కు రండి!

​మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు రెండు స్పష్టమైన ఆప్షన్లను ఇచ్చారు.
​చట్టసభకు ఎన్నికై, గతంలో బాధ్యతాయుతమైన మంత్రులుగా పనిచేసిన మీ పార్టీ (బీఆర్ఎస్) మాజీ మంత్రులు వస్తే.. మేము ప్రెస్ క్లబ్ వేదికగా ముఖాముఖి చర్చకు సిద్ధం.
​ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రజలు ఎన్నుకున్న దేవాలయం లాంటి శాసనసభలో ఈ అంశాలపై చర్చిస్తామన్నా.. మేము అక్కడా పూర్తి స్థాయి చర్చకు సిద్ధంగా ఉన్నాం.
​"సంక్షేమ శాఖలలో పూర్తి స్థాయిలో అన్ని అంశాలపై స్పష్టత, పారదర్శకతతో వ్యవహరించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. కానీ, చర్చ అనేది సమాన హోదా ఉన్న ప్రజాప్రతినిధుల మధ్య జరగాలి."

నా నిబద్ధత కరీంనగర్ ఎస్పీగా నీకు తెలియదా? ​

ప్రవీణ్ కుమార్‌తో తనకున్న పాత పరిచయాన్ని గుర్తు చేసిన పొన్నం ​"ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కరీంనగర్ జిల్లా ఎస్పీగా పని చేసినప్పుడు.. నేను అక్కడ విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. విద్యార్థి నాయకుడిగా సమాజం పట్ల, ప్రజా సమస్యల పట్ల నాకున్న నిబద్ధత ఏంటో అప్పట్లోనే ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయడం హాస్యాస్పదం" అని మండిపడ్డారు.

​బలహీన వర్గాల బిడ్డలపై పగ సాధిస్తే ఆ వర్గాలు క్షమించవు! ​

రాజకీయాల్లో కష్టపడి, ప్రజాదరణతో ఎదిగిన బలహీన వర్గాల నాయకులను టార్గెట్ చేయడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ​తమతో పాటు ప్రజాప్రతినిధులుగా ఉన్న లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ.. "రాజకీయంగా ఎదిగిన బలహీన వర్గాల బిడ్డలమైన నాపై, లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్‌లపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసి మా మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే చూస్తూ ఊరుకోం. ఆయా వర్గాల ప్రజలు నిన్ను ఎన్నటికీ క్షమించరు" అని హెచ్చరించారు.

​పరిధి దాటొద్దు..!

చివరగా, "పరిధి దాటి వ్యవహరించవద్దు ప్రవీణ్ కుమార్" అంటూ గట్టి హెచ్చరిక జారీ చేసిన పొన్నం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని, చర్చకు రావాలనుకుంటే తమ పార్టీ మాజీ మంత్రులను పంపాలని స్పష్టం చేశారు. ఈ ప్రతిసవాల్‌తో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంక్షేమ శాఖలపై చర్చ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
🏠 Home