స్వాతంత్ర్య శతాబ్ది నాటికి భారత్ ఎలా ఉండాలి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశం ఏ స్థాయికి ఎదగాలి? దిగుమతులపై ఆధారపడకుండా స్వయంసమృద్ధి సాధించాలంటే ఏ రంగాలకు పెద్దపీట వేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా దేశ భవిష్యత్ ప్రగతికి ఏడు చోదక శక్తులను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యసాధనకు తయారీ, వ్యవసాయం-ఆహార భద్రత, సాంకేతికత-ఆవిష్కరణలు, మౌలిక వసతులు, రక్షణ, హరిత ఇంధనం, భారత సాఫ్ట్పవర్ కీలకమని పేర్కొన్నారు. ఈ ఏడు రంగాలను ‘సప్తధార’గా అభివర్ణిస్తూ.. స్వయంసమృద్ధ, శక్తిమంతమైన భారత్ నిర్మాణానికి ఇవే పునాదులని స్పష్టం చేశారు.
తయారీలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ముద్ర
దేశ ఆర్థిక వ్యవస్థ తదుపరి దశ వృద్ధికి తయారీ రంగమే బలమైన పునాదిగా నిలవాలని ప్రధాని పిలుపునిచ్చారు. చిన్న చిన్న విడిభాగాల తయారీతో సరిపెట్టుకోకుండా.. సంపూర్ణ ఉత్పత్తులను దేశంలోనే తయారు చేసే స్థాయికి భారత్ ఎదగాలన్నారు. ప్రపంచ సరఫరా గొలుసుల్లో భారత్ కీలక భాగస్వామిగా మారాలంటే ధర, నాణ్యత, భారీస్థాయి ఉత్పత్తి పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. భారత ఉత్పత్తులకు నాణ్యతతోపాటు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ ప్రత్యేక గుర్తింపుగా మారాలన్నారు.
అన్నదాత బలమే.. దేశానికి భరోసా
వ్యవసాయం, ఆహార భద్రతను రెండో ప్రధాన శక్తిగా మోదీ పేర్కొన్నారు. ఎంతటి ఆర్థిక పురోగతి సాధించినా వ్యవసాయం ప్రాధాన్యం తగ్గదని స్పష్టం చేశారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తిని పెంచడంతోపాటు దీర్ఘకాలిక ఆహార భద్రతకు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్పాదకత పెంపు, ఆధునిక విధానాల వినియోగం ద్వారా రైతాంగాన్ని దేశాభివృద్ధిలో మరింత కీలక భాగస్వామిగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
టెక్నాలజీలో భారత్దే పైచేయి కావాలి
డేటా సెంటర్లు, రోబోటిక్స్, అధునాతన సాంకేతికతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ రంగాల్లో భారత్ అనుసరించే దేశంగా కాకుండా.. ప్రపంచానికి దిశ చూపే కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. యూపీఐ విజయంతో భారత సాంకేతిక సామర్థ్యం ఇప్పటికే ప్రపంచానికి తెలిసిందని గుర్తుచేశారు. తదుపరి తరం టెలికమ్యూనికేషన్పై మరింత వేగంగా అడుగులు వేస్తూ స్వదేశీ 6జీ సాంకేతికతను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
‘గతి శక్తి’తో అభివృద్ధికి వేగం
దేశ ఆర్థిక పురోగతికి అత్యాధునిక మౌలిక వసతులే వెన్నెముకని మోదీ పేర్కొన్నారు. రహదారులు, జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, సమర్థమైన రవాణా వ్యవస్థలతో ప్రాంతాల మధ్య అనుసంధానం పెరిగితే వ్యాపార, వాణిజ్య అవకాశాలు విస్తరిస్తాయన్నారు. ‘గతి శక్తి’ ద్వారా లాజిస్టిక్స్ను మరింత సమర్థంగా మార్చి, సరకు రవాణా వ్యయాన్ని తగ్గించడం ద్వారా భారత పరిశ్రమలకు అంతర్జాతీయంగా పోటీపడే సామర్థ్యం పెంచాలని చెప్పారు.
రక్షణలోనూ ఆత్మనిర్భర్
దేశ భద్రత విషయంలో విదేశీ దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని క్రమంగా తగ్గించాలని ప్రధాని స్పష్టం చేశారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తులను పెంచడంతోపాటు అత్యాధునిక సైనిక సాంకేతికతల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు సహా భవిష్యత్ యుద్ధ అవసరాలకు అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ సొంత సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. బలమైన స్వదేశీ రక్షణ పరిశ్రమ దేశ భద్రతకే కాకుండా ఆర్థిక వ్యవస్థకూ కొత్త అవకాశాలు తెస్తుందని పేర్కొన్నారు.
హరిత ఇంధనమే భవిష్యత్
అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని విస్మరించకూడదని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చుకుంటూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పునరుత్పాదక, స్వచ్ఛ ఇంధన వనరులను విస్తరించడం, క్లీన్ ఎనర్జీ సాంకేతికతల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఇంధన స్వావలంబన దిశగా భారత్ వేగంగా సాగాలని పిలుపునిచ్చారు.
సంస్కృతే.. ప్రపంచంలో మన శక్తి
భారతదేశ ‘సాఫ్ట్పవర్’ను ఏడో చోదక శక్తిగా ప్రధాని అభివర్ణించారు. యోగా నుంచి హస్తకళల వరకు.. సినిమాల నుంచి యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ వరకు భారత సృజనాత్మక రంగాలకు ప్రపంచవ్యాప్తంగా అపార అవకాశాలున్నాయని చెప్పారు. దేశంలోని జాతీయ పార్కులు, చారిత్రక, సాంస్కృతిక విశేషాలను అంతర్జాతీయ పర్యాటకులకు మరింత చేరువ చేయాలన్నారు. వేగంగా విస్తరిస్తున్న వినోద రంగం, ‘కాన్సర్ట్ ఎకానమీ’ కూడా పర్యాటకాభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తాయని పేర్కొన్నారు.
2047.. లక్ష్యం స్వయంసమృద్ధ భారత్
స్వాతంత్ర్య శతాబ్ది నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. తయారీలో స్వదేశీ సామర్థ్యం.. వ్యవసాయంలో భద్రత.. సాంకేతికతలో నాయకత్వం.. మౌలిక వసతుల్లో వేగం.. రక్షణలో స్వావలంబన.. ఇంధనంలో హరిత మార్పు.. సంస్కృతితో ప్రపంచంపై ప్రభావం—ఈ ‘సప్తధార’ ల సమ్మేళనమే వికసిత్ భారత్ కలను సాకారం చేసే మార్గమని పేర్కొన్నారు.
తయారీలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ముద్ర
దేశ ఆర్థిక వ్యవస్థ తదుపరి దశ వృద్ధికి తయారీ రంగమే బలమైన పునాదిగా నిలవాలని ప్రధాని పిలుపునిచ్చారు. చిన్న చిన్న విడిభాగాల తయారీతో సరిపెట్టుకోకుండా.. సంపూర్ణ ఉత్పత్తులను దేశంలోనే తయారు చేసే స్థాయికి భారత్ ఎదగాలన్నారు. ప్రపంచ సరఫరా గొలుసుల్లో భారత్ కీలక భాగస్వామిగా మారాలంటే ధర, నాణ్యత, భారీస్థాయి ఉత్పత్తి పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. భారత ఉత్పత్తులకు నాణ్యతతోపాటు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ ప్రత్యేక గుర్తింపుగా మారాలన్నారు.
అన్నదాత బలమే.. దేశానికి భరోసా
వ్యవసాయం, ఆహార భద్రతను రెండో ప్రధాన శక్తిగా మోదీ పేర్కొన్నారు. ఎంతటి ఆర్థిక పురోగతి సాధించినా వ్యవసాయం ప్రాధాన్యం తగ్గదని స్పష్టం చేశారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తిని పెంచడంతోపాటు దీర్ఘకాలిక ఆహార భద్రతకు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్పాదకత పెంపు, ఆధునిక విధానాల వినియోగం ద్వారా రైతాంగాన్ని దేశాభివృద్ధిలో మరింత కీలక భాగస్వామిగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
టెక్నాలజీలో భారత్దే పైచేయి కావాలి
డేటా సెంటర్లు, రోబోటిక్స్, అధునాతన సాంకేతికతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ రంగాల్లో భారత్ అనుసరించే దేశంగా కాకుండా.. ప్రపంచానికి దిశ చూపే కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. యూపీఐ విజయంతో భారత సాంకేతిక సామర్థ్యం ఇప్పటికే ప్రపంచానికి తెలిసిందని గుర్తుచేశారు. తదుపరి తరం టెలికమ్యూనికేషన్పై మరింత వేగంగా అడుగులు వేస్తూ స్వదేశీ 6జీ సాంకేతికతను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
‘గతి శక్తి’తో అభివృద్ధికి వేగం
దేశ ఆర్థిక పురోగతికి అత్యాధునిక మౌలిక వసతులే వెన్నెముకని మోదీ పేర్కొన్నారు. రహదారులు, జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, సమర్థమైన రవాణా వ్యవస్థలతో ప్రాంతాల మధ్య అనుసంధానం పెరిగితే వ్యాపార, వాణిజ్య అవకాశాలు విస్తరిస్తాయన్నారు. ‘గతి శక్తి’ ద్వారా లాజిస్టిక్స్ను మరింత సమర్థంగా మార్చి, సరకు రవాణా వ్యయాన్ని తగ్గించడం ద్వారా భారత పరిశ్రమలకు అంతర్జాతీయంగా పోటీపడే సామర్థ్యం పెంచాలని చెప్పారు.
రక్షణలోనూ ఆత్మనిర్భర్
దేశ భద్రత విషయంలో విదేశీ దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని క్రమంగా తగ్గించాలని ప్రధాని స్పష్టం చేశారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తులను పెంచడంతోపాటు అత్యాధునిక సైనిక సాంకేతికతల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు సహా భవిష్యత్ యుద్ధ అవసరాలకు అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ సొంత సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. బలమైన స్వదేశీ రక్షణ పరిశ్రమ దేశ భద్రతకే కాకుండా ఆర్థిక వ్యవస్థకూ కొత్త అవకాశాలు తెస్తుందని పేర్కొన్నారు.
హరిత ఇంధనమే భవిష్యత్
అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని విస్మరించకూడదని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చుకుంటూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పునరుత్పాదక, స్వచ్ఛ ఇంధన వనరులను విస్తరించడం, క్లీన్ ఎనర్జీ సాంకేతికతల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఇంధన స్వావలంబన దిశగా భారత్ వేగంగా సాగాలని పిలుపునిచ్చారు.
సంస్కృతే.. ప్రపంచంలో మన శక్తి
భారతదేశ ‘సాఫ్ట్పవర్’ను ఏడో చోదక శక్తిగా ప్రధాని అభివర్ణించారు. యోగా నుంచి హస్తకళల వరకు.. సినిమాల నుంచి యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ వరకు భారత సృజనాత్మక రంగాలకు ప్రపంచవ్యాప్తంగా అపార అవకాశాలున్నాయని చెప్పారు. దేశంలోని జాతీయ పార్కులు, చారిత్రక, సాంస్కృతిక విశేషాలను అంతర్జాతీయ పర్యాటకులకు మరింత చేరువ చేయాలన్నారు. వేగంగా విస్తరిస్తున్న వినోద రంగం, ‘కాన్సర్ట్ ఎకానమీ’ కూడా పర్యాటకాభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తాయని పేర్కొన్నారు.
2047.. లక్ష్యం స్వయంసమృద్ధ భారత్
స్వాతంత్ర్య శతాబ్ది నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. తయారీలో స్వదేశీ సామర్థ్యం.. వ్యవసాయంలో భద్రత.. సాంకేతికతలో నాయకత్వం.. మౌలిక వసతుల్లో వేగం.. రక్షణలో స్వావలంబన.. ఇంధనంలో హరిత మార్పు.. సంస్కృతితో ప్రపంచంపై ప్రభావం—ఈ ‘సప్తధార’ ల సమ్మేళనమే వికసిత్ భారత్ కలను సాకారం చేసే మార్గమని పేర్కొన్నారు.