మాజీ సీఎం స్టాలిన్కు టీవీకే లీగల్ నోటీసు: 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్!
రూ.కోటి పరువు నష్టం కోరిన టీవీకే నేత ఆదవ్ అర్జున్ డ్రగ్స్ కేసు ఆరోపణలపై తమిళనాడులో రాజకీయ దుమారం తమిళనాడు రాజకీయాల్లో డ్రగ్స్ కేసు వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ తమిళగ వెట్రి కళగం (TVK) ముఖ్య నాయకుడు ఆదవ్ అర్జున్.. డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు లీగల్ నోటీసులు పంపారు. సీఎం స్టాలిన్తో పాటు డీఎంకే ఐటీ విభాగానికి కూడా నోటీసులు జారీ చేసిన ఆయన.. 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలేం జరిగిందంటే..? ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI)...