ప్రగతి ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయండి: సీఎస్‌

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ప్రగతి (పీఎంజీ) ప్రాజెక్టుల అమలులో వేగం పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన రాష్ట్ర పరిధిలోని కీలక ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులు, వాటి పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. ​జాప్యానికి తావులేకుండా చర్యలు.. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించి, పనుల్లో ఎలాంటి జాప్యానికి తావులేకుండా నిరంతరం...