‘రామాయణ’పై భారీ అంచనాలు.. ట్రైలర్‌తో సోషల్ మీడియాలో చర్చ

దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణ’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించగా, అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో పలు అంశాలపై చర్చ కూడా కొనసాగుతోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తుండగా, సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. ట్రైలర్‌లోని కొన్ని విజువల్ ఎఫెక్ట్స్, కాంతి విన్యాసాలు, పాత్రల వస్త్రధారణపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తుది చిత్రంలో ఇవన్నీ మరింత మెరుగ్గా ఉంటాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాలపై చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మరోవైపు,...