వృత్తికి భరోసా.. భవితకు చదువు!
‘‘గీత, చేనేత కార్మికులందరికీ పింఛన్లు: సీఎం రేవంత్’’ ట్యాంక్బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ అక్టోబరు 22న పండుగ సాయన్న జయంతి అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటన ‘కులవృత్తిని గౌరవించండి.. పిల్లలను మాత్రం తప్పక చదివించండి’ హైదరాబాద్, ఆగస్టు 18 (మన విశ్వం): రాష్ట్రంలోని అర్హులైన గీత, చేనేత కార్మికులందరికీ సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మంగళవారం ట్యాంక్బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గౌడ సోదరులకు ఇప్పటికే 50 వేల కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు...