పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో గడల శ్రీనివాసరావు

ఉమ్మడి ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ గడల శ్రీనివాసరావు పేరును ముందస్తుగా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన జనసేన రాష్ట్ర నాయకుడిగా, అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతస్థాయిలో పనిచేసిన ఆయనకు వైద్య రంగంలో సేవలందించిన అనుభవం ఉంది. జనసేన జాతీయ కార్యదర్శి రామ్‌ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌గౌడ్‌.. గడల శ్రీనివాసరావు పేరును పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రతిపాదించారు. ఆయన అభ్యర్థిత్వానికి పవన్‌ కల్యాణ్‌ సుముఖత వ్యక్తం చేయడంతో పార్టీ ముందస్తుగా పేరును ప్రకటించినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.....