Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

మధిర సభ రద్దు.. హైదరాబాద్ నుంచే రైతుబంధు నిధుల విడుదల

Author MANA VISHWAM | 29 Jun 2026, 02:25 PM | TELANGANA
మధిర సభ రద్దు.. హైదరాబాద్ నుంచే రైతుబంధు నిధుల విడుదల

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం నిర్వహించాల్సిన ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే రైతులకు ప్రకటించిన కార్యక్రమంలో ఎలాంటి మార్పు లేకుండా, రైతుబంధు నిధుల విడుదలను హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి, అక్కడి నుంచే ముఖ్యమంత్రి రైతుబంధు నిధులను విడుదల చేయనున్నారు.
భారీ వర్షాలు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మధిర సభను వాయిదా వేసిన ప్రభుత్వం, రైతులకు నిధుల పంపిణీ ప్రక్రియ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ కానుంది.